![]() |
![]() |
.webp)
'గుప్పెడంత మనసు' ఇప్పుడు స్టార్ మా టీవీలో అత్యంత ఎక్కువ వీక్షకాదరణ పొందుతున్న ధారావాహిక. ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్-657లో వసుధార పోలీస్ స్టేషన్ నుండి హాస్పిటల్ కి వెళ్తుంది.
రిషి తన కాలేజీ దగ్గరికి వస్తాడు. వసుధారతో తను గడిపిన క్షణాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటాడు. అప్పుడే రిషి దగ్గరకు వస్తుంది జగతి. "అన్ని జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోనవసరం లేదు రిషి. మర్చిపో" అని చెప్తుంది. "మీ శిష్యురాలు నాకు మంచి గుణపాఠమే చెప్పింది. మీరేమో నా పసి మనసును అర్థం చేసుకోకుండా చిన్నప్పుడే, అలా వదిలిపెట్టి వెళ్ళారు. నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారో జవాబు చెప్పలేని మీరు ఈ ప్రశ్నకి జవాబు ఎలా చెప్తారు? మీ శిష్యురాలు మీకు కన్పిస్తే ఒక్కటి చెప్పండి. రిషీకి మోసపోవడం కొత్తేమీ కాదు. అలవాటే.. తను లేకపోయిన తన జ్ఞాపకాలతో బ్రతికేస్తానని చెప్పండి. తను నాకు అక్కర్లేదని కూడా చెప్పండి" అని చెప్పేసి అక్కడి నుండి రిషి వెళ్ళిపోతాడు. వసుధార హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ అమ్మనాన్నలైన చక్రపాణి, సుమిత్రలను చూస్తుంది. "అమ్మ.. లే అమ్మ" అని అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత తన తండ్రి చేయి పట్టుకొని "నాన్న మీకు గౌరవం పెంచే పనినే చేశాను. కాని ఎప్పుడు మిమ్మల్ని కించపరిచే పనిని చెయ్యలేదు నాన్న" అని ఏడుస్తుంది.
వసుధార దగ్గరికి రాజీవ్ వస్తాడు. "నువ్వు నేను ఈ ప్రపంచానికి ఇప్పుడు భార్యాభర్తలం" అని రాజీవ్ అంటాడు. దానికి వసుధార "బావ నోరు అదుపులో పెట్టుకో" అని అంది. "అదుపులో ఉంటుంది వసు.. ఇప్పుడు మనమిద్దరం అనఫీషియల్ గా భార్యభర్తలమన్నమాట" అని చెప్తాడు. "పురాణాల్లో రాక్షసుల ముగింపు ఎలా జరిగిందో నాకు తెలుసు. నీకు అదే గతి పడుతుంది" అని చెప్తుంది వసుధార. "ఏంటి శాపాలు పెడుతున్నావా వసు. మీ రిషీ సర్ పాపం.. తన పరిస్థితి ఎలా ఉందంటే, నీళ్ళలో మునిగిపోయే కాగితం పడవలా ఉంది. పడవే కానీ మునగక తప్పదులే. తనంటే నీకు ఇష్టమే, నువ్వంటే తనకు కూడా ప్రాణమే. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి అని అనుకుంటున్నాడు. కాబట్టి రిషి నీకు దూరమైనట్టే" అని అంటాడు. "పగటి కలలు కనకు బావ" అని వసుధార చెప్తుంది. ఆ తర్వాత చక్రపాణి, సుమిత్రలకు మెలకువ వస్తుంది. వాళ్ళు స్పృహలోకి రావడం చూసి, చాలా సంతోషపడుతుంది వసుధార. వెంటనే అక్కడున్న సిస్టర్ కి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |